కదిరి పట్టణంలోని కుమ్మరవాండ్లపల్లి నందు గురువారం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను వైసిపి రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తల హరిప్రసాద్ ప్రారంభించారు. వారి సొంత నిధులతో కుమ్మరవాండ్ల పల్లి నందు ప్రజలకు ఉచిత మంచి నీటి ప్లాంట్ వారి తల్లితండ్రులచే ప్రారంభించి వాటర్ క్యాన్స్ ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ, ఎంపీపీ అదినారాయణ తదితరులు పాల్గొన్నారు.