కదిరి: వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం

72చూసినవారు
కదిరి: వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం
గోరంట్ల మండలం కల్లీ తండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి కదిరికి చెందిన బిల్డర్ పాలెం సుధాకర్ శనివారం నివాళులర్పించారు. ఈ సందర్బంగా పాలెం సుధాకర్ వీర జవాన్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేసి మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదన్నారు. జవాన్ తల్లితండ్రులు జ్యోతి బాయి, శ్రీరామ్ నాయక్ కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పాలెం సుధాకర్ సతీమణి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్