కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయములో శుక్రవారం ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా వైకుంఠ ద్వారా (ఉత్తర రాజగోపురము) ఉత్తర ద్వారములో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం జరిగింది. తిరుమాడలలో భక్తల రద్దితో కిక్కిరిసింది.