పాకిస్తాన్ ముష్కరులతో విరోచితంగా పోరాడి అసువులు బాసిన భరతమాత ముద్దుబిడ్డ మురళి నాయక్ కు కుటాగుల లోని 36వ వార్డులోని తారకరామ నగర్ కాలనీలో శనివారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అతని పోరాట పటిమను కొనియాడడం జరిగినది. మురళి నాయక్ లేని లోటును వారి తల్లిదండ్రులకు తీర్చలేనిదని వారికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలన్నారు. జయరాం నాయక్, సుధీర్ నాయక్, జగదీష్ నాయక్ తదితరులు పాల్గొనడం జరిగినది.