గోరంట్లలోని ఎంపీపీ వంక స్కూల్ హెచ్ఎం నాగేశ్వరరావు మద్యం తాగి ఆడ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.విచారణ చేపట్టిన పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ బోయ శేఖర్ బుధవారం తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.