తనకల్లు: భూ సమస్య పరిష్కరించలేదని రైతు ఆత్మహత్య

65చూసినవారు
తనకల్లు: భూ సమస్య పరిష్కరించలేదని రైతు ఆత్మహత్య
కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూమికి అక్కా, బావ పట్టా పొంది దౌర్జన్యం చేస్తున్నారని తనకల్లు మం. గేమేనాయక్ తండా పంచాయతీ రామ్లానాయక్ తండాకు చెందిన శంకర్ నాయక్ అనే రైతు గురువారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని మృతుని తరపు బంధువులు తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. విచారించి వారి పట్టా రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి, మృతదేహాన్ని తీసుకువెళ్లారు.

సంబంధిత పోస్ట్