కళ్యాణదుర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ధూమ్ ధామ్ కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనే జట్ల యొక్క జెర్సీలను గురువారం కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో యువత తమ ప్రతిభను వెలికి తీయడానికే క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.