దుర్గం: కోర్టులో అంబేద్కర్ చిత్రపటం ఆవిష్కరించిన న్యాయవాదులు

69చూసినవారు
దుర్గం: కోర్టులో అంబేద్కర్ చిత్రపటం ఆవిష్కరించిన న్యాయవాదులు
కళ్యాణదుర్గం పట్టణంలోని సివిల్ కోర్టులో గురువారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. న్యాయమూర్తి సుభాన్, బహుజనుల లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణప్ప ఆధ్వర్యంలో న్యాయవాదులు అంబేద్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. న్యాయమూర్తి సుభాన్ మాట్లాడుతూ ప్రతి కోర్టులో జాతిపిత మహాత్మా గాంధీతో పాటు అంబేద్కర్ చిత్రపటాలను ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్