కళ్యాణదుర్గం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం రాత్రి దళిత గిరిజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళి నాయక్ కు సంతాపం వ్యక్తం చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. మురళి నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వీర జవాన్ మృతికి వారు కొద్దిసేపు మౌనం పాటించారు. దేశ రక్షణ కోసం ప్రతి యువకుడు ముందుకు రావాలన్నారు.