కళ్యాణదుర్గం: ఎక్సైజ్ సీఐపై చర్యలు తీసుకోవాలి: దళిత సంఘాలు

76చూసినవారు
కళ్యాణదుర్గం ఎక్సైజ్ కార్యాలయంలో అటెండర్‌ను చెప్పుతో కొట్టిన ఎక్సైజ్ సీఐ హసీనా బానును సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం రాత్రి ఎక్సైజ్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టి, ఎక్సైజ్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణ సస్పెన్షన్ కోరారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు.

సంబంధిత పోస్ట్