పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ పోలీసులు వ్యవహరిస్తున్నారని, వారి తీరు మారాలని విలేఖరుల సంఘం నాయకులు కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఈశ్వరమ్మకు గురువారం వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఎలాంటి నోటీసులు లేకుండా విజయవాడలో ఆయన ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు. కేవలం నిజాలను రాసినందుకే దాడులు చేస్తున్నారని వారు ఆరోపించారు.