మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 24వ వార్డులో ఎక్కడ చెత్త అక్కడే ఉందని కాలనీవాసులు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి చెత్త నుంచి దుర్వాసన వస్తోందని, దీని విషజ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు అడగడానికి వచ్చిన మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పటివరకు కాలనీ వైపు తిరిగి చూడకపోవడం బాధాకరమన్నారు.