కళ్యాణదుర్గం పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపల్ కమీషనర్ వంశీకృష్ణ భార్గవ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై మున్సిపల్ సిబ్బంది, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కమీషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రతి ఒక్క వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలన్నారు. ప్రజలు ప్లాస్టిక్ నిషేధం కోసం కృషి చేయాలన్నారు. వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.