కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామంలో ఆత్మకూరు-కొండాపురం రహదారి పక్కన గల పాళ్యం రాజేశ్వరమ్మకి చెందిన సర్వే నెంబర్ 160, 10ఎకరాల పొలంలో 2బొర్లకు ప్రభుత్వం అందించిన నీటి ఫిల్టర్లను, డ్రిప్ పరికరాన్ని గుర్తు తెలయని వ్యక్తులు చోరి చేశారు. ఈ ఘటనపై ఆదివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.