కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం ఎస్ఐ ఆధ్వర్యంలో మంగళవారం అనంతపూర్ జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బంది సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేశారు. బొబ్బర్లపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతుండగా 13 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.3,22,990లను, 9 వాహనాలు, 11 మొబైల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వారిని స్టేషన్ కు తీసుకుని వచ్చి వారిపై కేసు నమోదు చేశారు.