కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామంలో పూజారి లింగన్న శనివారం గోకులం షెడ్డును ప్రారంభించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద రైతు వాటా 10శాతంతో నిర్మించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం రైతులను విస్మరించి ఎలాంటి అవకాశాలు కల్పించకుండా నానా ఇబ్బందులు పెట్టిందని అన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు, పశువులు వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు షెడ్లు నిర్మిస్తోందన్నారు.