పిఠాపురం తరలివెళ్లిన కళ్యాణదుర్గం జనసేన నాయకులు

70చూసినవారు
పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ వేడుకలకు కళ్యాణదుర్గం జనసేన నాయకులు గురువారం బయలు దేరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. వాహనాలను కళ్యాణదుర్గం జనసేన ఇన్ చార్జి బాల్యం రాజేశ్ జెండా ఊపి ప్రారంభించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్