కళ్యాణదుర్గం మున్సిపాలిటీ గుండ్లప్పదొడ్డి కాలనీలో తాగు నీటి ఎద్దడి నెలకొంది. రెండు చేతి పంపులు పాడయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మంగళవారం చేతి పంపులకు మరమ్మతులు చేయించి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో కాలనీ ప్రజలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.