కుందుర్పి శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడింది. ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.