కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా నీలకంఠేశ్వర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సీఐ మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తానన్నారు. జూదాలపై ఉక్కు పాదం మోపుతానని తెలిపారు. నాటు సారా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.