కుందుర్చి మండలం జంబుగుంపల రైతుభరోసా కేంద్రంలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ (వీహెచ్ఎ)గా పని చేస్తున్న ప్రవీణ్ రాయితీ విత్తనాలు విక్రయించిన రూ. 11లక్షల సొమ్ముతో పరారైన విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. రైతు భరోసా కేంద్రం ఇన్ చార్జిగా ఉన్న ప్రవీణ్ రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. గత 10రోజుల నుంచి కార్యాలయం తెరవక పోవడంతో రైతులు మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు విచారణ చేపట్టారు.