అగళి మండలం హుల్లేకెరదేవరహళ్ళిలో గుడ్డద రంగప్ప స్వామి దేవాలయ పూజా కార్యక్రమానికి ఆదివారం టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. కొత్తగా వేయించిన బోరుకు మోటార్ పంపు ఏర్పాటు చేసి గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. జాతర మహోత్సవాన్ని టిడిపి నేతలు, కార్యకర్తలు విజయవంతంగా నిర్వహించారు.