అగళి మండలం మదూడి గ్రామం యువకుడు మంజునాథ్(25) కర్ణాటక రాష్ట్రం హాసన పట్టణంల బేకరీ అంగడిలో పని చేసుకుంటూ ఉండేవాడు. అతను గురువారం స్వగ్రామంకు వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ నుండి కిందపడి రోడ్డు ప్రమాదం లో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకొన్న మడకశిర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎస్ ఎల్ ఈరలక్కప్ప మృతుని స్వగ్రామంకు వెళ్లి మృతదేహానికి పూలమాలతో నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.