మడకశిర పట్టణంలో భారత సైన్యం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పే స్వామి సంఘీభావంగా ర్యాలీని నిర్వహించారు. పాకిస్తాన్ సైనికులతో వీరోచితంగా పోరాడి అమరులై వీర మరణం చెందిన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండ గ్రామపంచాయతీ కల్లి తాండ గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం. మురళి నాయక్ కి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు.