అగళి మండలం మధుడి గ్రామానికి చెందిన చాకలి సిద్దగంగమ్మ శుక్రవారం రైతు ద్విచక్ర వాహనంలో పూలు కోయడానికి వెళుతుండగా పిల్లి అడ్డు రావడంతో బ్రేక్ వేయగానే రోడ్డుపై పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను శిర ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆమెకు ఉన్నా ఓ కుమార్తెకు పెళ్లి చేశారు. కుమారుడు భర్త ఇంతకు ముందే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.