సెల్యూట్ టు జవాన్ మురళి నాయక్ అంటూ నినాదాలతో నల్లచెరువు మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి శుక్రవారం సాయంత్రం మార్మోగింది. అమరుడైన మురళి నాయక్ కి నల్లచెరువు యువత ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఘన నివాళులు అర్పించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ కూడలి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. భరతమాత ఓడిలో చేరిన మురళి నాయక్ వీర మరణం మరువలేనిదన్నారు.