పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన మురళి నాయక్ కు సంఘీభావంగా పెనుకొండలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ మీదుగా దర్గా సర్కిల్, తెలుగు తల్లి సర్కిల్ వరకు శుక్రవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ. ఈ సందర్భంగా మురళి నాయక్ వీర మరణం పొందడం బాధాకరమని వారి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. కూటమి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తన పాల్గొన్నారు.