అగళి మండలం జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీఓగా మంజునాథ్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఏపీఓ శివన్న గుడిబండకు బదిలీ కావడంతో ఇక్కడ ఖాళీగా ఉన్న ఏపీఔ పోస్టుకు అమరాపురం మండలంలో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మంజునాథను నియమించగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ మండలంలోని ఉపాధి కూలీలకు తన వంతుగా ఉపాధి కల్పించడానికి కృషి చేస్తానని తెలియజేశారు.