అనంతపురంలోని యాదవ్ ఫంక్షన్ హాల్ లో విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్ లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ జీవిత పోరాటం ప్రతిభావంతులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.