తన కొడుకు బోర్డర్లో 14 మంది పాక్ ముష్కరులను మట్టు పెట్టి చివరికి తాను వీరమరణం పొందాడని మురళీనాయక్ తండ్రి శ్రీరాం నాయక్తెలిపారు. గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్ మాట్లాడుతూ పలు విషయాలను వివరించారు. అతను రెండేళ్ల కిందట అగ్నివీర్ రిక్రూర్ట్మెంట్లో ఎంపికై ఉద్యోగంలో చేరాడని తెలిపారు. అతనికి మొత్తం నాలుగేళ్ల అగ్రిమెంట్ ఉందని వచ్చే ఏడాది నవంబరుతో ఆది ముగుస్తుందన్నారు. 14 మంది చొరబాటుదారులను చంపి వెనక్కు వస్తున్న సమయంలో మిగిలిన ఇంకో వ్యక్తి అటాక్చేసి చంపినట్లు చెప్పారు.