కల్లితాండ గ్రామానికి మురళి నాయక్ పార్థివదేహం చేరుకున్న విషయం తెలిసిందే. అయితే గుమ్మయ్యగారిపల్లి క్రాస్ నుండి కల్లితాండ వరకు మంత్రి సవితమ్మ, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, తోటి స్నేహితులతో వేలాది మంది ప్రజలు కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, మురళి నాయక్ అమర్ రహే అని నినాదాలు చేశారు.