గోరంట్ల మండలం గడ్డం తాండ పంచాయతీ కల్లీ తాండకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులను శుక్రవారం బీజేపీ శ్రీసత్యసాయి జిల్లా జి. ఎం. శేఖర్ పరామర్శించారు. ఈ సందర్బంగా మురళీ నాయక్ చిత్ర పటానికి జి. ఎం. శేఖర్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం మురళీ నాయక్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా వుంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పరందేశ్వరితో ఫోన్ లో మాట్లాడించారు.