గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహం శనివారం బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. ఈ సందర్బంగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ నందు సైనిక అధికారులు నుంచి సైనిక వందనం స్వీకరించిన అనంతరం అధికార లాంచనాలతో పార్థివ దేహాన్ని మంత్రి సవితకి సైనిక అధికారులు అప్పగించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత, తదితరులు పాల్గొన్నారు.