శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన విషయం తెలిసిందే. అయన మృతదేహం సొంత గ్రామమైన గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువత ప్రజలు దారిపొడున పూల వర్షంతో కురిపించారు. మురళి నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.