జమ్మూకశ్మీర్ సరిహద్దులో రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ అనే జవాన్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘దేశ రక్షణలో శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ అనే జవాన్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడికి నివాళులు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.’ అని శుక్రవారం ఎక్స్లో ట్వీట్ చేశారు.