గోరంట్ల మండలంలోని కల్లి తండాకు చెందిన అమరుడైన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి, అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. శుక్రవారం మురళి నాయక్ నివాసంలో తల్లిదండ్రులకు జ్యోతిబాయ్ & శ్రీరామ్ నాయక్ కి చెక్ను అందజేశారు.