గోరంట్ల మండలం గడ్డం తాండ పంచాయతీ కల్లి తండా గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. శుక్రవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ కల్లీ తండాకు చేరుకొని మురళీ నాయక్ తల్లిని ఓదార్చారు. మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.