గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ కల్లి తాండ గ్రామానికి చెందిన శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ ల ఏకైక కుమారుడు మురళి నాయక్ ఇండియన్ ఆర్మీలో మృతి చెందిన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అతన్ని కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి సవితమ్మ శుక్రవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అయన తల్లిదండ్రులను ఓదార్చి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మురళి నాయక్ ఒక గొప్ప యోధుడని కొనియాడారు.