గోరంట్ల మండలం కల్లి తండా గ్రామానికి చెందిన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి శనివారం ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ మంత్రి శంకర్ నారాయణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వీర జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమలో స్థానిక సర్పంచ్ నర్సిరెడ్డి తో పాటు గోరంట్ల, సోమందేపల్లి , పెనుకొండ మండలానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.