ప్రజా సంక్షేమమే వైసీపీ లక్ష్యం అని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. బుధవారం గోరంట్ల మండల కేంద్రంలో వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత మాజీ ముఖ్యమంత్రి వై. యస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కేక్ కట్ చేశారు.