గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి శుక్రవారం పూల మాల వేసి పెనుకొండ పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్ ప్రఖండ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిన అమరుడని కొనియాడారు.