పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ చిత్రపటాలకు గురువారం సాయంత్రం మాదిగ నేతలు పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు సహకరించిన కూటమినేతలకు కృతజ్ఞతలు తెలిపారు.