బెంగళూరు నుండి గోరింట్ల వరకు జవాన్ కాన్వాయ్ తో వచ్చిన మంత్రి సవితమ్మ

74చూసినవారు
బెంగళూరు నుండి గోరింట్ల వరకు జవాన్ కాన్వాయ్ తో వచ్చిన మంత్రి సవితమ్మ
గోరంట్ల మండలం గడ్డం తాండా పరిధి కల్లితాండాకు చేరుకున్న వీర జవాన్ మురళి నాయక్ పార్థివ దేహంను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామ ప్రజలు మురళి నాయక్ మృతదేహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కల్లి తాండా గ్రామం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. దేశం కోసం ప్రాణాలర్పించిన యోధుడు మా మురళి నాయక్ మా గ్రామస్తుడని చెప్పుకోవడానికి గర్వకారణమని అన్నారు. బెంగళూరు నుండి మురళి నాయక్ స్వగ్రామం వరకు రాష్ట్ర మంత్రి సవితమ్మ కాన్వాయ్ లోనే వచ్చారు. జాతీయ జెండాను పట్టుకొని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్