శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హెలిప్యాడ్ వద్ద హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె. పార్థసారథి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు కి ఎంపీ పార్థసారథి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికి సీఎం చంద్రబాబు కార్యక్రమాలలో ఎంపీ పాల్గొన్నారు.