పరిగి మండలం ధనాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బాధాకరమని మృతుని కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ ఆదివారం పేర్కొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం కాగా, మరో 7 మందికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఒక్కో కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు.