పెనుగొండ నియోజకవర్గం సిరా-కొడికొండ హైవే పరిగి మండలం ధనాపురం ప్రాంతంలో హిందూపురం కోటిపి చౌడమ్మ దేవస్థానానికి పౌర్ణమి సందర్భంగా భజనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందినవారేనని చెప్పారు.