సోమందేపల్లి మండల కేంద్రంలోని మారుతినగర్, నూతన కెనరా బ్యాంక్ వద్ద ప్రజలకు శనివారం పెనుకొండ సీఐ రాఘవన్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో యస్ఐ రమేష్ బాబు, ఏయస్ఐ మురళి పాల్గొన్నారు.