పెనుకొండ: సమ్మె నోటీసు అందజేసిన సీఐటీయూ నాయకులు

78చూసినవారు
పెనుకొండ: సమ్మె నోటీసు అందజేసిన సీఐటీయూ నాయకులు
పెనుకొండ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్ఐ దినేష్ కి ఈ నెల 20వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెతో పాటు స్థానిక డిమాండ్ల పరిష్కారానికై శుక్రవారం సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. సీఐటీయూ నాయకులు బాబావలి మాట్లాడుతూ, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, తదితర డిమాండ్ల సాధనకై సమ్మె జరుగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్