మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిలో ఆర్థిక పరిపుష్టి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. గురువారం పెనుకొండ పట్టణంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూమహిళల్లో ఆత్మ గౌరవం, ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.