పెనుగొండ పట్టణంలో నిన్న జరిగిన శివమాల స్వామిపై దాడి ఘటనలో కారకుడైన దాదును అరెస్టు అనంతపురం జిల్లా జైలుకు తరలించినట్లు పెనుకొండ సీఐ రాఘవన్ పేర్కొన్నారు. ఆదివారం సీఐ మాట్లాడుతూ ఈ సంఘటనకు బాధ్యుడైన దాదు పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరపరచగా జడ్జి రిమాండ్ కు ఆదేశిస్తూ అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని ఉత్తర్వులు ఇవ్వడంతో నిందితుడు దాదుని అనంతపురం జిల్లా జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.